
జోగులాంబ గద్వాల, 14 డిసెంబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం ఐడిఓసి సమావేశపు మందిరంలో వెబ్ కాస్టింగ్తో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది విధులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రెండో విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో మొత్తం 74 గ్రామ పంచాయతీలలో 18 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన గ్రామ పంచాయతీలలో సర్పంచ్తో పాటు 494 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు