
ములుగు, 14 డిసెంబర్ (హి.స.) ఎంతో విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాల్లో ఉండే ఓటర్లు పల్లె బాట పట్టారు. పట్టణాలకు పరిమితై ఉన్న వారిని తమ వైపు తిప్పుకోవడానికి పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి నయానో భయానో అప్పగించి గ్రామాలకు రప్పించుకున్నారు.
ములుగు జిల్లాలో రెండో విడతలో వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు