మెస్సి కోల్కతా ఇష్యూ.. క్రీడల మంత్రి రాజీనామా
కోల్కత్తా, 16 డిసెంబర్ (హి.స.) ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్కతా పర్యటన సందర్భంగా స్టేడియంలో అభిమానులు కుర్చీలు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర క్రీడల మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీ
మెస్సి ఇష్యు


కోల్కత్తా, 16 డిసెంబర్ (హి.స.)

ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి

కోల్కతా పర్యటన సందర్భంగా స్టేడియంలో అభిమానులు కుర్చీలు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర క్రీడల మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు.

స్టేడియంలో జరిగిన అవాంఛనీయ ఘటనపై న్యాయంగా, పారదర్శకంగా విచారణ జరగాలనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజీనామా లేఖను పంపినట్లు ఆయన వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande