
నల్గొండ, 16 డిసెంబర్ (హి.స.)
గ్రామ పంచాయతీ చివరి విడత ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న దేవరకొండ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ దేవరకొండ ఆర్డిఓ, డిపిఓ, జెడ్ పి సీఈఓ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు