నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌గాంధీకి ఊరట
ఢిల్లీ 16,డిసెంబర్ (హి.స.) నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి కాస్త ఊరట లభించింది. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు ది
Sonia and Rahul Gandhi


ఢిల్లీ 16,డిసెంబర్ (హి.స.) నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి కాస్త ఊరట లభించింది. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే, ఈ కేసు (National Herald case)లో ఈడీ తమ దర్యాప్తును కొనసాగించొచ్చని న్యాయస్థానం తెలిపింది.

ప్రైవేటు వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో దర్యాప్తు జరిపి ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసినట్లు న్యాయస్థానం విచారణ సందర్భంగా వెల్లడించింది. చట్టప్రకారం దీన్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే దిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. అలాంటప్పుడు ఈడీ (ED) ఛార్జ్‌షీట్‌ ఆధారంగా తీర్పు ఇవ్వడం తొందరపాటు చర్యే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande