
తిరుపతి 16 డిసెంబర్ (హి.స.)
, దేశంలోనీ అన్ని ఆలయాలకు టీటీడీ నుంచి ధ్వజస్థంభాలు ఇవ్వడానికి 100 ఎకరాల్లో ఉద్యానవణం ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈరోజు (మంగళవారం) జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో వివరించారు. పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి అదనంగా రూ.48 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ