
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై నేడు అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటలకు స్పీకర్ కార్యాలయానికి BRSతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు హాజరుకానున్నారు.
అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్రెడ్డి అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ తీర్పు రాజకీయంగా కీలకంగా మారనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు