
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)
నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. వెంకటాపురం డివిజన్లోని భూదేవినగర్లో పార్కులో రూ.17 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పనులను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కులో ఆహ్లదంతో పాటు, జిమ్ ఏర్పాటుతో ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..