
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.)
అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి వెంకట నరసమ్మ (99) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీ నివాసానికి చేరుకుని తమ సంతాపాన్ని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ