‘న్యాయమే గెలిచింది’.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై ఖర్గే
ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ గాంధీలకు ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసు (National Herald case)పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్న
Congress president Kharge criticizes Modi government's economic policies


ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ గాంధీలకు ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసు (National Herald case)పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని కాంగ్రెస్‌ స్వాగతించింది. న్యాయమే గెలిచిందంటూ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. కేవలం రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదు. అందుకే ఈ కేసు దాఖలు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను స్వాతంత్ర్య సమరయోధులు 1938లో స్థాపించారు. సీబీఐ, ఈడీలను ఉపయోగించి కాంగ్రెస్‌ నాయకులను, ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని వేధించాలని ఈ వ్యక్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ కేసులో ఎలాంటి బలం లేదు’ అని ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande