
అమరావతి, 18 డిసెంబర్ (హి.స.), :నకిలీ నోట్లుమార్చేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని బ్యాంకులోనే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ నగదు విత్డ్రా చేసుకోవడానికి మండల కేంద్రంలోని స్టేట్బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకులో నగదు డ్రా చేసిన అనంతరం అక్కడే ఉన్న వాయల్పాడుకు చెందిన ఓ వ్యక్తికి నోట్లు లెక్కించమని రూ.50 వేల కట్ట ఇచ్చాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ