
ఢిల్లీ 18డిసెంబర్ (హి.స. ) న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య మార్కెట్లో కొన్ని దేశాలు సుంకాలు, ఇతర చర్యలను ఆయుధాలు గా మలుచుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో భారత్ చాలా జాగ్రత్తగా సంప్రదింపులు జరపా ల్సి వస్తున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం ఇక స్వేచ్ఛాయుతం, అనుకూ లం ఏ మాత్రం కాదన్న విషయం స్పష్టమైందని టైమ్స్ నెట్వర్క్ ఇండి యా ఎకనామిక్ కాంక్లేవ్లో ఆమె పేర్కొన్నారు. అమెరికా తర్వాత తాజాగా మెక్సికో కూడా భారత్పై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అప్పుల తగ్గింపుపై దృష్టి : ఆర్థిక నిర్వహణలో పాదర్శకత్వం, దేశ రుణ భారం తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుందని సీతారామన్ అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు రాష్ట్రాలు కూడా ఇదే బాటను అనుసరించాలని మంత్రి కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ