
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ 'కాంతార' వివాదంపై క్షమాపణలు తెలిపాడు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో రణ్వీర్ సింగ్తో పాటు రిషబ్ శెట్టి పాల్గొనగా.. ఈ వేడుకలో రిషబ్ను ఉద్దేశించి రణ్వీర్ మాట్లాడుతూ.. కాంతార చిత్రంలో పంజుర్లీ దేవతను దెయ్యం అని సంబోధించడంపై కన్నడిగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే ఈవెంట్లో అత్యంత పవిత్రంగా భావించే కాంతారలోని ఓం... అనే గర్జనను రణ్వీర్ హాస్యంగా అనుకరించి చూపించాడు. దీన్ని చూసిన కన్నడ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది మా సంస్కృతి, మా ఆరాధనలో భాగం... దాన్ని జోక్గా తీసుకోవడం సరికాదని రణ్వీర్పై విరుచుకుపడుతున్నారు. చాలా మంది కన్నడిగులు రణ్వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై రణ్వీర్ సింగ్ క్షమాపణలు తెలిపాడు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు