
ఖమ్మం, 2 డిసెంబర్ (హి.స.)
త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల
నేపథ్యంలో తల్లాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఖమ్మం సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ అకస్మిక తనిఖీ నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ నెల 4వ తారీఖు నుంచి సత్తుపల్లి నియోజకవర్గంలో మూడో విడత నామినేషన్లను ఎన్నికల నిర్వహణ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని. అదేవిధంగా నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవరైనా అభ్యర్థి నామినేషన్తో పాటు కుల ధృవీకరణ పత్రం బదులుగా గెజిటెడ్ డిక్లరేషన్ సమర్పించిన అంగీకరించాలని వారు చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు