తిరుమలలో భారీ వర్షాలతో తగ్గిన భక్తుల రద్దీ.. గంటల్లోనే సులువుగా శ్రీవారి దర్శనం
తిరుమల, 2 డిసెంబర్ (హి.స.) ఆపదమొక్కలవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భారీ వర్షాల కారణంగా భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం వివిధ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని
తిరుమల


తిరుమల, 2 డిసెంబర్ (హి.స.) ఆపదమొక్కలవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భారీ వర్షాల కారణంగా భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం వివిధ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం గంటలోనే శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని కేవలం 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సోమవారం స్వామి వారిని 70,345 మంది భక్తులు దర్శించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande