
విజయవాడ, 2 డిసెంబర్ (హి.స.)గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుచరులకు విజయవాడ ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న తేలప్రోలు రాము (A3), వజ్రకుమార్ (A6) లకు న్యాయస్థానం ఈనెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయించుకోవడానికి కోర్టుకు హాజరైన వారికి న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అనుచరులైన కొమ్మా కోటేశ్వరరావు, తేలప్రోలు రాము, వజ్రకుమార్, ఎర్రంశెట్టి రామాంజనేయులు, చేబ్రోలు శ్రీనివాసరావు, వేణు నిందితులుగా ఉన్నారు. వీరంతా కొంతకాలంగా పరారీలో ఉండటంతో, వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారెంట్లు జారీ చేసింది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV