
విశాఖపట్నం, 20 డిసెంబర్ (హి.స.)
: భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయీ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ విశాఖపట్నంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భాజపా అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ