
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు
మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళా సంఘాల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను మహిళలకు కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మండలానికి ఒకటి చొప్పున, మున్సిపాలిటీల్లో రెండు చొప్పున మహిళా సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లు కేటాయించేలా అధికారులు ప్రణాళిక రచిస్తునట్టు సమాచారం. దీనిపై వారం పది రోజుల్లో విధివిధానాలను ఖరారు చేయనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..