ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సర్పంచులు పని చేయాలి : జుక్కల్ ఎమ్మెల్యే
నిజామాబాద్, 22 డిసెంబర్ (హి.స.) గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిలుపునిచ్చారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ లు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్
జుక్కల్ ఎమ్మెల్యే


నిజామాబాద్, 22 డిసెంబర్ (హి.స.)

గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల

సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిలుపునిచ్చారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ లు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నూతన ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలకు స్వచ్ఛమైన, పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా అడుగులు వేయాలని కోరారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande