రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2025లో పెరిగిన నేరాలు. సిపి సుధీర్ బాబు
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.) రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఏడాాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల సంఖ్య పెరిగినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. ఇవాళ రాచకొండ 2025 క్రైమ్ వార్షిక నివేదికను ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో గత ఏడాది 28,626 కే
రాచకొండ సి పి సుధీర్ బాబు


హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)

రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఏడాాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల సంఖ్య పెరిగినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. ఇవాళ రాచకొండ 2025 క్రైమ్ వార్షిక నివేదికను ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో గత ఏడాది 28,626 కేసులు నమోదు కాగా , 2025 లో 33,040 కేసులు నమోదు అయినట్లు చెప్పారు. దోపిడీ 3, దొంగతనాలు 67, ఇళ్లలో చోరీ 589, వాహనాల చోరీలు 876 సాధారణ చోరీలు 1, 161, హత్యలు 73, అత్యాచారలు 330 వరకట్నం చావులు 12, గృహ హింస కేసులు 782 నమోదైనట్లు వివరించారు. కిడ్నాప్ కేసులు, ఫోక్సో కేసులు సంఖ్య కూడా పెరిగిందని ఈ సంవత్సరం 579 కిడ్నాప్ కేసులు, 1224 ఫోక్సో కేసులు నమోదయ్యాయని, మర్డర్ ఫర్ గెయిన్ కేసులు 3 నమోదైనట్లు తెలిపారు.

మహిళలపై నేరాలు హైక్:

గత ఏడాదితో పోలిస్తే మహిళ పై నేరాలు సంఖ్య 4 శాతం పెరిగిందని ఈఏడాది 20 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కేసుల్లో 668 మంది నిందితులు అరెస్ట్ చేశామన్నారు. 256 డ్రగ్స్ కేసులు నమోదు చేసి ఇందులో 2090 కిలోల గంజాయి, 35 కిలోల గంజాయి చాక్లేట్లు, 34 కేజీల హ్యాష్ ఆయిల్, 216 గ్రాముల ఎండీఎంఏ, 10 కిలోల ఓపీఎస్, 242 గ్రాముల హెరాయిన్, 35 కిలోల గసగసాల సామాగ్రి సీజ్ చేసినట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande