
గోదావరిఖని, 22 డిసెంబర్ (హి.స.)
కాక వెంకటస్వామి అణగారిన
వర్గాలకు ఆశాజ్యోతి అని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. సోమవారం కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా జియం ఆఫీస్ వద్ద గల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. పేదల పెన్నిధి, ఎంతో మంది నిరుపేదలకు గూడు కల్పించిన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ కేంద్ర మంత్రి, పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటస్వామి తెలిపారు. ప్రజాహిత సేవలతో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు