గ్రామాల అభివృద్ధితో దేశం అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి
నారాయణపేట, 24 డిసెంబర్ (హి.స.) కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నారాయణపేట్ జిల్లా కోస్గి పర్యటన సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మ
సీఎం రేవంత్ రెడ్డి


నారాయణపేట, 24 డిసెంబర్ (హి.స.)

కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నారాయణపేట్ జిల్లా కోస్గి పర్యటన సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ పునాదులు గ్రామాల్లో ఉన్నాయని గాంధీ చెప్పారని.. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన పాలన అందుబాటులోకి వస్తుందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande