
గుంతకల్ల, 25 డిసెంబర్ (హి.స.):రైల్వే డివిజన్ కేంద్రమైన గుంతకల్లు నుంచి మార్కాపురం రోడ్డు (వయా నంద్యాల) డెయిలీ ప్యాసింజరు (నం. 57407/08) రైలును ప్రవేశ పెట్టనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు-మార్కాపురం రోడ్డు ప్యాసింజరు రోజూ సాయంత్రం 5.30 గంటలకు గుంతకల్లులో బయలుదేరి రాత్రి 8.30కి నంద్యాలకు రాత్రి 11.30కి మార్కాపురం రోడ్డు(Markapuram Road)స్టేషన్కు చేరుకుంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ