
ఢిల్లీ25,డిసెంబర్ (హి.స.)
డెలివరీ బాయ్స్ దేశవ్యాప్తంగా తమ ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా మరియు ఇతర సౌకర్యాలను కోరుతూ స్విగ్గీ, జోమాటో వంటి గిగ్-ఎకామర్స్ ఫ్లాట్ఫారమ్లకు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నిరసనకు కారణంగా, డిసెంబర్ 25 (క్రిస్మస్) మరియు డిసెంబర్ 31 (న్యూ ఇయర్) రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో ఫుడ్ డెలివరీ సేవలు నిలిచిపోవనున్నాయి.
డెలివరీ బాయ్స్ నిరసనలో భాగంగా రెండు గంటల పాటు పని నిలిపివేయనున్నారు. దీని వల్ల ఫుడ్ డెలివరీ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోతాయి. తెలంగాణలో కూడా గిగ్ & ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ సమన్వయంతో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ బంద్కు పిలుపునిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ