
హుస్నాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హుస్నాబాద్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభనేపథ్యంలో పోలీసు శాఖ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అదే సందర్భంలో, సీఎం పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగే అవకాశముందని భావించి హుస్నాబాద్ మండలానికి చెందిన ప్రతిపక్ష బుధవారం తెల్లవారుజామునే ముందస్తుగా అరెస్టు చేశారు. సీఎం పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందన్న సమాచారం ఆధారంగా, పోలీసు అధికారులు పలువురు నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు