
కామారెడ్డి, 3 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం తాడ్వాయి మండలం కరడ్పల్లిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీఏసిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కరడ్పల్లి పిపిసి వద్ద వరి కొనుగోలు వేగంపై కలెక్టర్ సమీక్షించారు. రైతుల రాకపోకలు,గన్నీ సంచుల రవాణా సదుపాయాలను క్షుణ్ణంగా లభ్యత, పరిశీలించారు.
గన్నీ సంచులు, తూకం, ట్రక్కుల రవాణా, మిల్లులకు తరలింపు వంటి అంశాలలో సంపూర్ణ సమన్వయం ఉండేలా చూసుకోవాలని, త్వరితగతిన కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు