
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
ఎల్బీనగర్: ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఎస్సై సంజయ్ సావంత్ (58) గుండెపోటుతో మృతిచెందారు. పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండటంతో మంగళవారం రాత్రి పీఎస్లోనే ఆయన నిద్రించారు. ఈ క్రమంలో ఎస్సైకు గుండెపోటు రావడంతో చనిపోయారు. నాచారంలో నివాసముండే సంజయ్ సావంత్.. నేడు అబ్దుల్లాపూర్మెట్లో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంది. ఎస్సై మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ