
పెద్దపల్లి, 3 డిసెంబర్ (హి.స.)
భవిత సెంటర్ కు దివ్యాంగ విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత సెంటర్ లో రిజిస్టరైన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం నుంచి శుక్రవారం వరకు భవిత సెంటర్ కు రావాలని, వారం రోజులలో రెండు సార్లు విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయడం జరుగుతుందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు