ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 2 వేలు దాటిన కేసులు
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి (Scrub typhus disease) తీవ్రస్థాయిలో విజృంభించి.. ప్రజలను వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,000 మార్కును దాటగా, ఈ
scrub


అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి (Scrub typhus disease) తీవ్రస్థాయిలో విజృంభించి.. ప్రజలను వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,000 మార్కును దాటగా, ఈ వ్యాధి బారిన పడి 22 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలు పొదలు, గడ్డిలో ఉండే 'చిగ్గర్' మైట్స్ (నల్లులు) కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా (Bacteria) బారిన పడుతున్నారు. బాధితుల్లో తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, నల్లి కుట్టిన చోట నల్లటి మచ్చ (ఎస్కార్) వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సకాలంలో గుర్తించకపోవడం వల్ల వ్యాధి ముదిరి అవయవాలు దెబ్బతినడమే మరణాలకు ప్రధాన కారణమవుతోంది.

వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ కిట్లు, అవసరమైన యాంటీబయోటిక్ మందులను అందుబాటులో ఉంచింది. పొలాలు, గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేవారు ఒళ్లంతా కప్పేలా దుస్తులు ధరించాలని, జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం మరియు పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవడం ద్వారా ఈ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande