తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
తిరుమల, 4 డిసెంబర్ (హి.స.) కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం శ్రీవారిని దర్శనానికి జనం చాలా తక్కువ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దాదాపు 8 గంటల సమయం పడుతో
తిరుమల


తిరుమల, 4 డిసెంబర్ (హి.స.)

కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం శ్రీవారిని దర్శనానికి జనం చాలా తక్కువ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దాదాపు 8 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న వారికి 2 గంటల్లో దర్శనం అవుతోంది. అదేవిధంగా గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లో మొత్తం 11 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.

కాగా, బుధవారం స్వామి వారిని 63,887 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 22,561 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande