
జోగులాంబ గద్వాల, 7 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో రెండో సారి జరిగే సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు- 2025 దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని, కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురి కాకూడదని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు