
నిర్మల్, 8 డిసెంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని
సంతోషిమత ఆలయ సమీపంలో గల నందన టీ పాయింట్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో హత్యకు గురైన మహిళ పక్కనే ఓ వ్యక్తి అక్కడనే కూర్చుని ఉండడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..