
బొమ్మూరు, 9 డిసెంబర్ (హి.స.)
, : బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వెలుగులు పంచడానికి సిద్ధమవుతోంది. గతంలో ఇక్కడ చదువుకున్న వారు మేధావులుగా, పండితులుగా పేరొందారు. తర్వాత పరిస్థితుల్లో కళ తప్పింది. కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం చొరవతో ఈ ఏడాది ఎంఏ తెలుగు కోర్సు ప్రారంభించారు. మరిన్ని కోర్సులు త్వరలో ప్రారంభిస్తామని వీసీ డా.డి.మునిరత్నం నాయుడు చెబుతున్నారు. పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ