జైపాల్రెడ్డికి భారత రత్న ఇవ్వాలి.. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన మంత్రులు, ప్రముఖులు
హైదరాబాద్, 28 జూలై (హి.స.) కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కి భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని స్మారక ఘాట్లో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.
జైపాల్ రెడ్డి


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి

కి భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని స్మారక ఘాట్లో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీనియర్ నేత కె కేశవరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు. హైదరాబాద్కు మెట్రో జైపాల్ రెడ్డి కృషి వల్లే వచ్చిందని చెప్పారు.

దేశం మొత్తం మీద నిజాయితీగా పని చేసిన వ్యక్తి అని, ఆయనను తెలంగాణ మరువదని చెప్పుకొచ్చారు. ఉత్తమ పార్లమెంటరీ అవార్డు గ్రహీత అయిన జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని, అలాగే నాగర్ కర్నూల్ జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande