అమరావతి, 28 జూలై (హి.స.)
అమరావతి: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఈపీసీ విధానంలో ఈ టెండర్లను ఆహ్వానించింది. ఫేజ్-1లో 38.4 కి.మీ మేర రెండు కారిడార్లలో విజయవాడ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్-1లో నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు.. కారిడార్-2లో బస్స్టేషన్ నుంచి పెనమలూరు వరకు మెట్రో నిర్మాణం జరగనుంది. కారిడార్-1లో 4.7 కి.మీ మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. 32 చోట్ల మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ రానుంది. ఇప్పటికే విశాఖ మెట్రో రైలు టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ