ఏపీ రైతులకు పండుగ ముందే వచ్చింది.. ఆగష్టు 2న ఖాతాల్లోకి రూ. 7 వేలు..
అమరావతి, 29 జూలై (హి.స.)అన్నదాతల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కలిసి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవ నిధులు దక్కేలా నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు విడుద
ఏపీ రైతులకు పండుగ ముందే వచ్చింది.. ఆగష్టు 2న ఖాతాల్లోకి రూ. 7 వేలు..


అమరావతి, 29 జూలై (హి.స.)అన్నదాతల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కలిసి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవ నిధులు దక్కేలా నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు విడుదలవుతుండగా, అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్నదాత సుఖీభవ’ నిధులూ రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇది ఏపీ రైతులకు ఒక పెద్ద ఊరట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు తొలి దశ నిధుల్ని విడుదల చేయనున్నారు.

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు అందించనుంది. మొత్తంగా ఒక్కరోజే రైతు ఖాతాలోకి రూ.7 వేలు నేరుగా డిపాజిట్ కానుంది. కేంద్రానికి సంబంధించిన కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరై నిధులు విడుదల చేస్తారు. ఈ విడతలో ఏపీకి రూ.831.60 కోట్లు పీఎం కిసాన్ నిధులు లభించనున్నాయి. వీటిని 41.58 లక్షల మంది రైతు కుటుంబాలకు జమ చేస్తారు. ఈ లెక్కన ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి రూ.2 వేలు చొప్పున అందుతుంది.

టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా రైతులకు చేస్తున్న సహాయం ఇది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నదాత సుఖీభవ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. ఇప్పుడు తొలివిడతగా రూ.5 వేలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇది నేరుగా రైతు ఖాతాలోకి జమవుతుంది. మరిన్ని విడతలూ త్వరలోనే వస్తాయని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 46.64 లక్షల మంది రైతు కుటుంబాలను సుఖీభవకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల మంది ఈకేవైసీ పూర్తిచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande