అమరావతి, 29 జూలై (హి.స.)
, కడప- కడప ఏడురోడ్లు, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పులివెందుల జడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్రెడ్డి దాదాపు మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆకేపాటి అమర్నాథ్రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంతో పాటు జడ్పీ ఛైర్మన్ పదవులకు గత ఏడాది జూన్ 7న రాజీనామా చేయాల్సి వచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ