షిర్డీ వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్
తిరుపతి, 29 జూలై (హి.స.) షిర్డీ వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. తిరుపతి - సాయినగర్ షిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 29 వరకూ 18
షిర్డీ వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్


తిరుపతి, 29 జూలై (హి.స.)

షిర్డీ వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. తిరుపతి - సాయినగర్ షిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 29 వరకూ 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రతి ఆదివారం ఉదయాన్నే 4 గంటలకు తిరుపతి - సాయినగర్ షిర్డీ (07637) రైలు బయల్దేరి.. మరుసటిరోజు ఉదయం 10.45 గంటలకు షిర్డీకి చేరుకోనుంది. షిర్డీ - తిరుపతి (07638)సోమవారం రాత్రి 7.35 గంటలకు బయల్దేరి మంగళవారం అర్థరాత్రి 1.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. ఇలా 18 స్పెషల్ ట్రైన్స్ ప్రతివారం తిరుపతి - షిర్డీ, షిర్డీ - తిరుపతి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

18 ప్రత్యేక రైళ్లు.. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహిరాబాద్, బీదర్, భాల్కి, ఉగ్దిర్, లాతూర్ రోడ్డు, పర్లి, గంగఖేర్, పర్భని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్ సోల్, మన్మాడ్, కోపర్ గావ్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande