అనంతపురం, 30 జూలై (హి.స.)
:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ )వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో పీవీఎన్ మాధవ్ ఇవాళ(బుధవారం జులై 30) పర్యటించారు. బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాయలసీమలో తొలిసారిగా ఆయన పర్యటించారు. నగరంలో చాయ్ పే కార్యక్రమాన్ని మాధవ్ నిర్వహించారు. వివిధ వర్గాలతో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ