నిరుపేదలకు సన్నబియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బాలు నాయక్
తెలంగాణ, నల్గొండ. 30 జూలై (హి.స.) ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర
ఎమ్మెల్యే బాలు నాయక్


తెలంగాణ, నల్గొండ. 30 జూలై (హి.స.)

ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుపేద సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande