అమరావతి, 31 జూలై (హి.స.): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనను ముగించుకొని బుధవారం రాత్రి 11:25 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. హైదరాబాద్ మీదుగా ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబుకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమారుగుప్తా, ఎస్పీ గంగాధరరావు, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలను ఆహ్వానించేందుకు సీఎం నాలుగురోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఆయన వెంట మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్ సహా వివిధశాఖల ఉన్నతాధికారులు సింగపూర్కు తరలి వెళ్లిన సంగతి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ