అమరావతి, 4 ఆగస్టు (హి.స.)
,:ఏడు రోజుల పాటు సింగపూర్, మలేషియాలో మంత్రి నారాయణ పర్యటించి ఆదివారం సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అనువైన పద్ధతులను మంత్రి బృందం అధ్యయనం చేసింది. భవన నిర్మాణాలు, రోడ్లు, మౌలికవసతులు, రోడ్డు రవాణా, కన్వెన్షన్ సెంటర్లు, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు, పార్కులను మంత్రి బృందం పరిశీలించింది. సింగ్పూర్, మలేషియాల్లోని బెస్ట్ ప్రాక్టీస్ను అమరావతి నిర్మాణంలో ఉపయోగించే యోచన చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ