ఆగస్టు.15 నుంచి ఆర్టీసీ బస్సులో.మహిళలకు. ఉచిత.ప్రయాణం/మంత్రి రాంప్రసాద్ .రెడ్డి
అమరావతి, 4 ఆగస్టు (హి.స.) : ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ (బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి (తెలిపారు. ‘శ్రీ శక్తి’ పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ( ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో
ఆగస్టు.15 నుంచి ఆర్టీసీ బస్సులో.మహిళలకు. ఉచిత.ప్రయాణం/మంత్రి రాంప్రసాద్ .రెడ్డి


అమరావతి, 4 ఆగస్టు (హి.స.)

: ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ (బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి (తెలిపారు. ‘శ్రీ శక్తి’ పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ( ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

‘‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు. మహిళలు తమ ఆధార్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. 6,700 బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనికోసం రూ.1,950 కోట్ల వ్యయం అవుతుంది. 3వేల విద్యుత్‌ బస్సుల కొనుగోలుకు సీఎం ఆదేశించారు. రానున్న రెండేళ్లలో 1,400 ఎలక్ట్రిక్‌ బస్సులు కొనుగోలు చేస్తాం’’ అని మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande