తిరుమల, 4 ఆగస్టు (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.
ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గుతూ వస్తోంది.
ఈ తరుణంలో నేడు(సోమవారం) తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కేవలం 6 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. నిన్న(ఆదివారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారి ని 82,628 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,339 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.25 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి