న్యూఢిల్లీ, 9 ఆగస్టు (హి.స.) నేడు రాఖీ పౌర్ణమి. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ దేశ ప్రజలు నేడు రక్షాబంధన్ను వేడుకగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరులకు ప్రేమగా రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఢిల్లీ పాఠశాలల విద్యార్థులు ఇవాళ ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి రాఖీలు కట్టారు. చిరునవ్వులు చిందిస్తూ.. చిన్నారులు ఎంతో ప్రేమతో మోదీకి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించారు. రాఖీలు కట్టే సమయంలో ఆ విద్యార్థినుల పేర్లు, క్లాస్ ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిన్నారులతోపాటూ బ్రహ్మకుమారీలు సైతం ప్రధానికి రాఖీ కట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్