రాజన్న సిరిసిల్ల, 1 సెప్టెంబర్ (హి.స.)
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్ళి, ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా పరిశీలించారు.
అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా ఫిజిక్స్ పాఠాలు బోదించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించి, రాయించి, సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణ మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు