పెద్దపల్లి, 11 సెప్టెంబర్ (హి.స.)
అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది జోహార్లు అర్పిస్తూ అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్లో ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణ పురువీధుల గుండా సాగి తిరిగి కలెక్టరేట్కు చేరింది. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..