అనంతపురం) 12 సెప్టెంబర్ (హి.స.):పట్టణంలోని బీఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఫ్లోర్బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపినట్లు హెచ్ఎం జ్యోతిలక్ష్మి, పీడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం, పీడీ మాట్లాడుతూ గత నెలలో నరసరావుపేట(Narasaraopet)లో జరిగిన 19వ నేషనల్ ఫ్లోర్బాల్ పోటీలలో తమ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ