ఫార్ములా ఈ-రేస్ కేసులో పురోగతి.. విజిలెన్స్ కమిషన్కు చేరిన ఏసీబీ నివేదిక
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే కేసు సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ రిపోర్టును తాజాగా విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. అయితే, మరో రెండు రోజుల్లో ఫైల్ ప
ఫార్ములా ఈ కార్ రేస్


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే కేసు సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ రిపోర్టును తాజాగా విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. అయితే, మరో రెండు రోజుల్లో ఫైల్ పై తుది నిర్ణయం తీసుకుని విజిలెన్స్ కమిషన్ సర్కార్కు ఫార్ములా ఈ-రేసు కేసు తుది నివేదికను అందజేయనుంది. అక్కడి ఆమోదం వచ్చిన వెంటనే నిందితులపై చార్జీషీటు దాఖలుకు చేసేందుకు తిరిగి నివేదిక ఏసీబీకి చేరనుంది.

కాగా, ఫార్ములా ఈ-రేసు కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు A4, A5 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ను రెండు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ను మూడు సార్లు ఏసీబీ ప్రశ్నించింది. అయితే, ఫార్ములా ఈ-కారు రేస్లో భారీగా అవినీతి జరిగినట్లుగా ఏసీబీ తేల్చింది. కేసులో క్విడ్ ప్రోకోను అధికారులు స్పష్టమైన సాక్షాధారాలతో నిరూపించినట్లుగా సమాచారం.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande