వామనరావు దంపతుల హత్య.. కేసు నమోదుచేసిన సీబీఐ
హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (CBI) చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసింది
సిబిఐ


హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.)

పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (CBI) చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులుగా వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లను చేర్చింది. 2021, ఫిబ్రవరి 17న పెద్దపల్లి సమీపంలో వామనరావు దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు సుప్రీం కోర్టులో పిషన్ దాఖలు చేశారు. గత నెల 12న పిటిషనర్కు అనుకూలంగా తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు నమోదుచేసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande